డబుల్ బెడ్‌ రూం ఇళ్లను ప్రారంభించిన స్పీకర్

by  |
డబుల్ బెడ్‌ రూం ఇళ్లను ప్రారంభించిన స్పీకర్
X

దిశ, నిజామాబాద్: బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం హంగర్గ గ్రామంలో రూ.1.51 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆదివారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ డబుల్ బెడ్‌ రూం ఇళ్లు పేదొళ్ల ఆత్మగౌరవం కాపాడుతాయని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని 106 గ్రామాల్లో రూ.500 కోట్లతో 5000 ఇళ్లు నిర్మిస్తున్నామని, త్వరలోనే అవి పూర్తవుతాయన్నారు. సీఎం సహకారంతో నియోజకవర్గ పరిధిలో మరో 10వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి పేదలకు అందజేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు తీసుకువచ్చి ఆయకట్టు భూములకు నీళ్లందిస్తామన్నారు.


Next Story

Most Viewed