ముగ్గురు పోలీసుల సస్పెన్షన్

by  |

దిశ, నిజామాబాద్: ఆడియో టేపులు ముగ్గురి పోలీసు కొలువులకు ఎసరు పెట్టాయి. ఇసుక మాఫియాతో పోలీసులు కుమ్మక్కు అయ్యారంటూ సోషల్ మీడియాలో ఆ టేపు వైరల్ అయింది. దీంతో జిల్లా ఎస్పీ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఏఆర్ కానిస్టేబుల్ వెంకట్రావు, శ్రీకాంత్, సివిల్ కానిస్టేబుల్‌ ఇలియాజ్‌లు విధులు నిర్వహిస్తున్నారు. అయితే, పోలీసు ఉద్యోగంలో ఉండి అక్రమాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఆడియో టేపు రూపంలో వైరల్ అయ్యాయి. దీంతో గురువారం జిల్లా ఎస్పీ శ్వేత ఆ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.



Next Story

Most Viewed