మానవత్వం చాటిన నల్లగొండ ఎస్పీ

by  |
మానవత్వం చాటిన నల్లగొండ ఎస్పీ
X

దిశ, నల్లగొండ:

పోలీసులంటే కేవలం కఠినంగా మాత్రమే ఉంటారని, మానవత్వం ఉండదని ఉన్న ప్రచారానికి నల్లగొండ ఎస్పీ రంగనాథ్ పుల్‌స్టాప్ పెట్టారు. వాడపల్లి వద్ద రెండ్రోజులుగా ఆంధ్రా సరిహద్దులో వేచి ఉన్న వందలాది మంది ఆంధ్రాకు చెందిన ప్రయాణికులకు అల్పాహారం, టీ, స్నాక్స్, బిస్కెట్స్ అందించడంతో పాటు వారందరిని తిరిగి హైదరాబాద్ పంపించే విధంగా జిల్లా పోలీసు శాఖ తరఫున 5 బస్సులను ఏర్పాటు చేశారు. అందరినీ వాడపల్లి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. దీంతో ఎస్పీ రంగనాధ్ చొరవ, సహాయానికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags: nalgonda SP ranganath, distributed, tea, snacks, ap travelers


Next Story

Most Viewed