నాన్న చికిత్సకు స్పందిస్తున్నారు: ఎస్పీ చరణ్

by  |
నాన్న చికిత్సకు స్పందిస్తున్నారు: ఎస్పీ చరణ్
X

దిశ, వెబ్ డెస్క్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై అతని కుమారుడు చరణ్ మీడియాకు వెల్లడించారు.‘‘నాన్నగారికి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగవుతోంది. చికిత్స‌కు స్పందిస్తున్నారు. శ్వాస కూడా సులభంగా తీసుకుంటున్నారు.’’ అని చరణ్ తెలిపారు. కాగా, కరోనా కారణంగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. మొదట్లో కోలుకున్నట్లే కనిపించినా క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఆసుపత్రి వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు బాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన సంగతి తెలిసిందే.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed