ఎస్పీ బాలు ఆరోగ్యంపై బులెటిన్ విడుదల

by  |
ఎస్పీ బాలు ఆరోగ్యంపై బులెటిన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు చెన్నై ఎంజీఎం ఆస్పత్రి గురువారం సాయంత్రం బులెటిన్ వెల్లడించింది. ప్రస్తుతం ఎక్మో, వెంటిలేటర్ సహా ఇతర మార్గాల ద్వారా చికిత్స అందిస్తున్నాం, 24గంటల్లో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఎప్పటికప్పుడు ఆస్పత్రి వర్గాలు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాయి అని బులెటిన్‌లో పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆగస్టు 5న ఎంజీఎంలో చేరిన బాలు.. ఇటీవలే కోలుకొని ఇవాళ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


Next Story

Most Viewed