గ్యాస్ లీకేజ్‌ ఘటన‌పై అంతర్గత దర్యాప్తు

by  |
గ్యాస్ లీకేజ్‌ ఘటన‌పై అంతర్గత దర్యాప్తు
X

విశాఖ జిల్లా ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజ్ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆ సంస్థ కూడా సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అంతర్గత దర్యాప్తు కోసం దక్షిణకొరియా నుంచి ఒక ప్రత్యేక బృందం భారత్‎కు బయల్దేరింది. ఈ మేరకు దక్షిణ కొరియాలోని ఎల్జీ కెమికల్స్ ప్రధాన కార్యాలయం ప్రకటన చేసింది. ఎల్జీ పెట్రో కెమికల్ విభాగం అధినేత నేతృత్వంలో దర్యాప్తు చేపట్టే ఈ ప్రత్యేక బృందంలో 8 మంది సభ్యులు ఉంటారని స్పష్టం చేసింది. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా దక్షిణ కొరియా బృందం భేటీ కానున్నట్టు సమాచారం. పరిశ్రమలో స్టిరీన్ గ్యాస్ లీకేజ్‎కు గల కారణాల విశ్లేషణతో పాటు గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ప్రజలు తీసుకోవాల్సిన చర్యలను ఈ బృందం వివరించనుంది.



Next Story

Most Viewed