- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకలను ఆయన కూతురు హన్షితా రెడ్డి ఘనంగా నిర్వహించింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న దిల్ రాజు.. ఈ మధ్యే రెండో పెళ్లి చేసుకోగా, ఆ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేలా బర్త్డే బ్యాష్ అరేంజ్ చేసింది హన్షిత. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్ తేజ్, మహేశ్ బాబు, నాగచైతన్య, సమంత, అఖిల్ అక్కినేని, రామ్ పోతినేని, వరుణ్ తేజ్, విశ్వక్ సేన్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కన్నడ హీరో యశ్, పూజా హెగ్డే, అనుపమ పరమేశ్వరన్, నివేదా పేతురాజ్, అంజలి తదితరులు అటెండ్ అయ్యారు. గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలోనే సమాజసేవకు సంకల్పించినట్లు దిల్ రాజు వెల్లడించారు. ఇది పబ్లిసిటీ కోసం మాత్రం కాదని, తనకు ఇంత పరువు ప్రతిష్ట సంపాదించిపెట్టిన ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్యపై ఫోకస్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.