‘7 వారాల్లో 20 వేల కేజీల గంజాయి’

by  |
‘7 వారాల్లో 20 వేల కేజీల గంజాయి’
X

దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సరిహద్దుల్లో శాంతిభద్రతలపై దక్షిణాది రాష్ట్రాల డీజీపీల కీలక సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, తెలంగాణ డీజీపీ మహేంద్రరెడ్డి, కేరళ డీజీపీ లోక్ నాథ్ బెహ్రా, తమిళనాడు జేకే త్రిపాఠి, కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, కోవిడ్ నియంత్రణలో రాష్ట్రాల మధ్య సమన్వయం, తీరప్రాంత గస్తీ, మనుషుల అక్రమ రవాణాలపై చర్చించారు. చెన్నై, కోల్‌కత్తా కేంద్రంగా కృష్ణా, అనంతపురం, ఉభయగోదావరి జిల్లాల మనుషుల అక్రమ రవాణా అరికట్టేందుకు సహకరించాలని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఇతర రాష్ట్రాల డీజీపీలను కోరారు. ఏపీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో గురించి వివరించారు. ఎస్‌ఈబీ ఏర్పాటుతో ఏడువారాల్లో 20 వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఈ సందర్భంగా డీజీపీ సవాంగ్‌ వెల్లడించారు.

Next Story

Most Viewed