ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ రూట్లలో అదనంగా స్పెషల్ ట్రైన్లు

by  |
Trains
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. నవంబర్ 11, 13, 14, 15వ తేదీల్లో నుంచి అదనంగా 12 ప్యాసింజర్ స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్టు ప్రకటన విడుదల చేసింది.

ఇందులో భాగంగా.. నవంబర్ 11 నుంచి మిర్యాలగూడ టు నడికుడి(Train No:07277), నడికుడి టు మిర్యాలగూడ(Train No:07973) మధ్య రెండు ట్రైన్లు, ఇదే రోజు కాచిగూడ టు మిర్యాలగూడ(Train No:07276), మిర్యాలగూడ టు కాచిగూడ(Train No:07974) మధ్య మరో రెండు ప్యాసింజర్ ట్రైన్లు నడపనున్నారు.

నవంబర్ 13 నుంచి రేపల్లె టు తెనాలి(Train No:07873-07875)-తెనాలి టు రేపల్లె(Train No:07874-07876) రూట్లలో మొత్తం నాలుగు ట్రైన్లు నడపనున్నారు.

నవంబర్ 14 నుంచి నర్సాపూర్ టు విజయవాడ(Train No:07044), విజయవాడ టు నర్సాపూర్(Train No:07045) మధ్య మరో రెండు ట్రైన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

నవంబర్ 15న కాచిగూడ టు రొటెగాన్(Train No:07571), రొటెగాన్ టు కాచిగూడ(Train No:07572) మధ్య రాకపోకలకు రెండు ట్రైన్లు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేశారు.



Next Story

Most Viewed