అత్యాధునిక సదుపాయాలతో కూకట్‎పల్లి పీఎస్

by  |
అత్యాధునిక సదుపాయాలతో కూకట్‎పల్లి పీఎస్
X

దిశ, హైదరాబాద్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు సత్వరమే సేవలందిచేందుకు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‎ను అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి తీసుకొచ్చామని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన కూకట్‎పల్లి నూతన పోలీస్ స్టేషన్‎ను.. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి సీపీ సజ్జనార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన క్యాంప్ కార్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని పోలీస్ స్టేషన్‎కు కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ సందర్శంగా ఎమ్మెల్యే కృష్ణారావును సీపీ శాలువాతో సత్కరించారు. రానున్న రోజుల్లో కేపీహెచ్‎బీ పోలీస్ స్టేషన్, మోతినగర్ పోలీస్ స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో ప్రత్యేకంగా నిర్మిస్తామని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ వెంకటేశ్వరరావు, మాదాపూర్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీలు సురేందర్ రావు, భుజంగరావు, కూకట్ పల్లి సీఐ లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed