థర్డ్ వేవ్ ఆల్రెడీ వచ్చేసింది.. సంచలన కామెంట్స్ చేసిన సోనూ సూద్

by  |
sonusood news
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సోనూ సూద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. భారత్‌లో ఆల్రెడీ థర్డ్ వేవ్ నడుస్తుందని చెబుతూ ట్విట్టర్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. పోస్ట్ ప్రకారం ‘‘దేశంలో థర్డ్ వేవ్ ఉంటుందా అని ఎవరో నన్ను అడిగారు.. దానికి నేను సమాధానం ఇచ్చాను.‘ దేశంలోని సామాన్యుల నిరుద్యోగ సమస్య, పేదరికంతో మేము ఇప్పటికే థర్డ్‌వేవ్‌ను అనుభవిస్తున్నాము.

ఇది కరోనా థర్డ్‌వేవ్ కంటే తక్కువేమి కాదు. నిరుపేదలకు సహాయం చేయండి.. ఉపాధినివ్వండి ఇదే దీనికి మందు’అని సమాధానం ఇచ్చాను.’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన చేసిన ట్వీట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా.. కార్పొరేట్ సంస్థలకు, కోటీశ్వరులకు ఆలోచింపజేసే విధంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తూ షేర్ చేస్తున్నారు.



Next Story

Most Viewed