విద్యార్థులకు సపోర్ట్‌గా నిలుస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోను‌సూద్

by  |
విద్యార్థులకు సపోర్ట్‌గా నిలుస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోను‌సూద్
X

దిశ, సినిమా: రియల్ లైఫ్ హీరో సోనుసూద్ మరోసారి స్టూడెంట్స్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్కార్ బోర్డ్ ఎగ్జామ్స్ క్యాన్సల్ చేయాలని డిమాండ్ చేశారు. సౌదీ, మెక్సికో, కువైట్ లాంటి దేశాల్లో ఇండియాతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉందని, ఆ దేశాల్లో ఎగ్జామ్స్ క్యాన్సల్ చేసినప్పుడు ఇలాంటి టఫ్ టైమ్స్‌లో విద్యార్థులు, వారి కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌లో మాత్రం ఎందుకు పరీక్షలు క్యాన్సల్ చేయకూడదని ప్రశ్నించారు.

కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఆఫ్‌లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే స్టూడెంట్స్‌తో పాటు వారి కుటుంబాలకు కూడా సేఫ్ కాదని అభిప్రాయపడ్డారు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మెథడ్‌ను ఫాలో అవుతూ విద్యార్థులను ప్రమోట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.



Next Story

Most Viewed