కాంగ్రెస్ ఎంపీలతో రేపు సోనియా గాంధీ సమావేశం

by  |
కాంగ్రెస్ ఎంపీలతో రేపు సోనియా గాంధీ సమావేశం
X

న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం తమ పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో లోక్‌సభ ఎంపీలంతా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. దేశంలో కొవిడ్ పరిస్థితులు, దానిని కట్టడి చేయడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇతరత్రా అంశాల మీద ఆమె ఎంపీలతో చర్చించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ఎంపీలంతా లైవ్ లోకి రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.



Next Story

Most Viewed