- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలతో పోటీపడి మరి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వరుస సినిమాలకు కమిట్ అయిన చిరు.. ప్రస్తుతం ‘ఆచార్య’ ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తర్వాత మోహన్ రాజా డైరెక్షన్లో ‘లూసిఫర్’ రీమేక్లో పాల్గొననుండగా, ప్యారలల్గా మెహర్ రమేశ్ డైరెక్షన్లో ‘వేదాళం’ రీమేక్తో పాటు బాబీ డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నారు. కాగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కబోయే మూవీకి సంబంధించిన అప్డేట్ సినీవర్గాల్లో వినిపిస్తోంది.
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శ్రుతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపించగా.. ఇప్పుడు ఈ లిస్టులో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా చేరింది. మూవీ యూనిట్ సోనాక్షిని సంప్రదించేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తుండగా.. తను ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్తే సూపర్ స్టార్ రజనీకాంత్ ‘లింగ’ తర్వాత ఆమె నటించబోయే సౌత్ సినిమా ఇదే అవుతుంది. అయితే సోనాక్షి నటించిన ‘లింగ’ ఫ్లాప్ అవడాన్ని గుర్తుచేసుకుంటున్న అభిమానులు.. రిజల్ట్ ఎలా ఉంటుందో? అని టెన్షన్ పడుతున్నారు.