- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం బాలీవుడ్లో నెపోటిజంపై చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అది ఎంతగా అంటే.. కరణ్ జోహార్, అలియా భట్ లాంటి వారిని బాయ్కాట్ బాలీవుడ్ పేరుతో అన్ఫాలో చేసేంతలా. వారసత్వం ఉన్న ప్రతీ ఒక్క సెలబ్రిటీకి కూడా అభిమానుల సెగ తగలడంతో వారంతా ఆన్లైన్లోకి వచ్చేందుకు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే శతృఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా ఏకంగా ట్విట్టర్కు గుడ్ బై చెప్పింది. అకౌంట్ను డీయాక్టివేట్ చేస్తూ ట్విట్టర్ నుంచి బ్రేక్ తీసుకుంది.
‘మన చిత్తశుద్ధిని కాపాడుకునే క్రమంలో మొదటి స్టెప్ నెగెటివిటీకి దూరంగా ఉండటమని తెలుసుకున్నాను’ అని తెలిపిన సోనాక్షి.. ట్విట్టర్లో ఉన్నంత నెగెటివిటీ మరెక్కడా లేదని చెప్పింది. అందుకే తన అకౌంట్ను డీయాక్టివేట్ చేస్తున్నట్లు ప్రకటించి.. బై చెప్పేసింది. చివరగా మీరైనా ప్రశాంతంగా ఉండండని చెప్పడం కొసమెరుపు.
Next Story