మేనమామ, మేనల్లుడి కిరాతకం.. నిద్రిస్తున్న తల్లి మెడపై..!

by  |
మేనమామ, మేనల్లుడి కిరాతకం.. నిద్రిస్తున్న తల్లి మెడపై..!
X

దిశ, జుక్కల్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. తల్లిపై కన్నకొడుకు హత్యాయత్నం చేశాడు. ఎస్సై రాజు కథనం ప్రకారం.. మద్నూర్ గ్రామ పంచాయతీకి చెందిన గోసం లక్ష్మీ అనే మహిళ సోమవారం రాత్రి తన నివాసంలో నిద్రిస్తున్న సమయంలో కొడుకు రవి, తన మేనమామ ప్రవీణ్‌తో కలిసి పథకం ప్రకారం ఇంట్లో ఉన్న కత్తితో మెడపై గాయపరిచి హత్య చేసేందుకు యత్నించారు.

లక్ష్మీ వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసి జీర్ణించుకోలేకే కొడుకు రవి ఈ హత్యాయత్నానికి పాల్పడినట్టు ఎస్ఐ తెలిపారు. ఆ రాత్రి తల్లి లక్ష్మీ పడుకున్న రూమ్‌లోనే పడుకున్నాడు. అర్ధరాత్రి కాగానే మేనమామ, అల్లుడు ఇద్దరూ తల్లిపై హత్యాయత్నం చేశారు. ప్రస్తుతం బాధితురాలు నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఎస్ఐ తెలిపారు. గోస లక్ష్మీ కూతురు శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.

Next Story

Most Viewed