తల్లిపైనే కొడుకు అత్యాచారయత్నం

by  |
తల్లిపైనే కొడుకు అత్యాచారయత్నం
X

దిశ, వెబ్ డెస్క్: సభ్య సమాజం తలదించుకునేలా దారుణ చోటు చేసుకుంది. మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన నెలకొంది. తొమ్మిది నెలలు మోసి, కొడుకును అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ తల్లిపై కన్న కొడుకే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

గుంటూరు జిల్లా బాపట్ల మండలానికి చెందిన ఓ యువకుడికి(30) ఎనిమిదేండ్ల క్రితం వివాహం అయ్యింది. ఇద్దరు బిడ్డలు పుట్టారు. మద్యానికి బానిసైన ఆ యువకుడు రోజూ తాగి వచ్చి భార్యను హింసించేవాడు. దీంతో భర్త వేధింపులు తాళలేక నాలుగేండ్ల క్రితమే భర్తను వదిలి పుట్టింటికి వెళ్లింది. అప్పటినుంచి ఆ యువకుడు తల్లివద్దనే ఉంటున్నాడు. రోజూ మద్యానికి డబ్బులు కావాలంటూ తల్లిని వేధించేవాడు.

ఈ క్రమంలోనే ఇటీవల మద్యం మత్తులో తల్లిని కూడా తీవ్రంగా కొట్టడంతో బంధువుల ఇంటికి వెళ్లింది. అనంతరం కొడుకు తిన్నాడో లేడో అని మళ్లీ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపై మద్యం మత్తులో ఉన్న కొడుకు అత్యాచారం చేయబోయాడు. ఏం జరుగుతుందో తెలియక ఆ తల్లి మొదట హతాశురాలైంది. ఆ వెంటనే తేరుకుని కొడుకును ఆపే ప్రయత్నం చేసింది. అయినా కొడుకు మళ్లీ మళ్లీ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీంతో ఆ తల్లి కొడుకు కళ్లలో కారం కొట్టింది. పక్కనే ఉన్న తాడు తీసుకుని అతడి మెడకు బిగించి చంపేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది..

Next Story

Most Viewed