కన్నతల్లి కడుపు చీల్చి..పేగుల్ని బయటకు లాగి

by  |
కన్నతల్లి కడుపు చీల్చి..పేగుల్ని బయటకు లాగి
X

దిశ,వెబ్‌డెస్క్: మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా కసాయికొడుకు తల్లిని దారుణంగా హత్య చేశాడు. ఎస్ఆర్ నగర్ పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన వీరప్ప, సంగీతలు హైదరాబాద్ బల్కంపేటలో నివాసం ఉంటుంన్నారు. వారికి ఐదుగురు సంతానం. తండ్రి వీరప్ప వీధి వ్యాపారం చేస్తుంటే సంగీత ఇళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఏడాది క్రితం అనారోగ్యం కారణంగా వీరప్ప మరణించాడు.అయితే పెద్దకొడుకులు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ తల్లికి చేదోడువాదోడుగా నిలుస్తుంటే చిన్నకొడుకు సంతోష్ మాత్రం జులాయిగా మారాడు. ఎప్పటిలాగే మద్యానికి బానిసైన సంతోష్ తనకు డబ్బులు కావాలంటూ తల్లి సంగీతతో గొడవపెట్టుకున్నాడు.ఈ గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో, విచక్షణ కోల్పోయిన సంతోష్.., వంటింట్లో ఉన్న కత్తితో తల్లి సంగీతను విచక్షణ రహితంగా పొడిచాడు. ఆపై బాధితురాలి కడుపులో నుంచి పేగుల్ని బయటకు తీసి రాక్షసానందం పొందాడు. దీంతో అన్న సంతోష్ తీరుతో భయాందోళనకు గురైన చిన్న కూతురు బాబాయ్‌కి ఫోన్ చేసి జరిగిన దారుణం గురించి చెప్పింది. తల్లీకొడుకుల మధ్య పెనుగులాటలో అరుపులు విన్న స్థానికులు ఇంటి తలుపులు తెరిచి చూడగా..బాధితురాలు రక్తపుమడుగులో నిర్జీవంగా పడి ఉంది. తల్లిని హత్య చేసి పారిపోతున్న సంతోషను పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.



Next Story

Most Viewed