దారుణం.. కుటుంబాన్ని పట్టించుకోవట్లేదని తండ్రిని చంపిన కొడుకు

by  |
దారుణం.. కుటుంబాన్ని పట్టించుకోవట్లేదని తండ్రిని చంపిన కొడుకు
X

దిశ, ఆదిలాబాద్: ప్రస్తుత రోజుల్లో మనుషులు తన తెలివి తేటలతో ఊహకు అంతుచిక్కని విషయాలను సైతం వెలుగులోకి తెస్తున్నారు. అంటే తమ మేధస్సుతో ఎన్నో విషయాలను తెలుసుకోగలగుతున్నారు. దీని అర్థం ప్రస్తుతం సమాజంలో మనుషుల్లో తెలివితేటలకు కొదవలేదని.. ఎంతటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలుగుతారని. కానీ, కొంతమంది కొన్ని,కొన్ని సమస్యలకు పరిష్కారమార్గం దిశగా ప్రయత్నించకుండా దారుణాలకు ఒడి కడుతున్నారు. ఈ సమయంలో మంచి, చెడులు, రక్త సంబంధాలను మరిచిపోతున్నారు. దీంతో మంచి భవిష్యత్ ఉన్న వారి జీవితాలు జైలు పాలవుతున్నాయి. ఇటు కుటుంబాలకు, అటు సమాజానికి దూరమవుతున్నారు. ఇందుకు ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ఉదాహరణ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామానికి చెందిన దుర్గం ప్రసాద్ (45), ప్రణవ్ రావు అనే వీరిద్దరూ తండ్రీకొడుకులు. అయితే గత కొద్దిరోజుల నుంచి దుర్గం ప్రసాద్(చర్చి ఫాదర్) తన కుటుంబాన్ని పట్టించుకోవడంలేదు. దీంతో కోపంతో అతడిని పెద్ద కొడుకు ప్రణవ్ రావు గొడ్డలితో నరికి చంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. అనంతరం ప్రణవ్ రావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.



Next Story

Most Viewed