- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నల్లగొండ క్రైం : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన అల్లుడు మద్యం మత్తులో అత్తారింటికి నిప్పటించాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన సైదులుకు, మర్రిగూడకు చెందిన సుమలతకు 10 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో మూడేండ్ల క్రితం సుమలత తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై సైదులు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో మర్రిగూడకు వెళ్లి అత్తగారింటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇంటిసామగ్రి, రెండు బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.