కన్నకొడుకా కర్కోటకుడా.. తల్లిని నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి..!

by  |
son-beat
X

దిశ, వెబ్‌డెస్క్ : తల్లిదండ్రులను పున్నామా నరకం నుంచి రక్షించేవాడే కొడుకు అంటారని నానుడి. కానీ, సమాజంలో ప్రస్తుతం అందుకున్న భిన్నంగా నడుస్తోంది. వృద్ధ తల్లిదండ్రులను చివరిరోజుల్లో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకులు వారిని పట్టించుకోవడం లేదు. మరికొందరైతే ఆస్తులు పంచి ఇవ్వాలని హింసించడం, ఇంట్లోంచి గెంటేయడం లేదా అడ్డుతొలగించుకోవాడానికి సైతం వెనకాడటం లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా డబ్బులు ఇవ్వలేదని ఓ కొడుకు వృద్ధురాలు అయిన తల్లిని నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళి దారుణంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం నమ్మాకల్ జిల్లా పొన్నేరిపట్టిలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. షణ్ముగం అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఏ పని చేయకుండా దుబారాగా తిరుగుతున్నాడు. అయితే, తాగేందుకు డబ్బులు ఇవ్వాలని తల్లిని తరచూ హింసిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే పొదుపు స్కీంలో దాచుకున్న రూ.3 లక్షలు ఇవ్వాలంటూ తల్లిని నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి కొట్టాడు. అయితే, కుమారుడికి ఇదివరకే తల్లి పొలం రాసిచ్చినట్టు తెలుస్తోంది. వృద్దురాలిపై షణ్ముగం దాడి చేస్తున్న సమయంలో ఓ శునగం అడ్డుకునేందుకు యత్నించిన దృశ్యాలు వీడియోలో మనం చూడొచ్చు. ఈ వీడియో తెగ వైరల్ అవ్వడంతో షణ్ముగాన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


Next Story