కురిచేడు ఘటనపై సోమువీర్రాజు దిగ్భ్రాంతి

by  |
కురిచేడు ఘటనపై సోమువీర్రాజు దిగ్భ్రాంతి
X

కురిచేడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, శానిటైజర్ తాగిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కాగా, కురిచేడులో శానిటైజర్ తాగి సుమారు పది మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

Next Story