విశాఖ విషాదంపై సోము వీర్రాజు విచారం

by  |
somu veerraju
X

దిశ, వెబ్‌‌డెస్క్: విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్‌లో జరిగిన ప్రమాదంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే, సహాయక కార్యక్రమాల్లో బీజేపీ శ్రేణులు ముందుడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారన్న ఆయన.. సందర్శకులు సైతం ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని.. బాధితులకు న్యాయం చేసేలా కోరతాం అంటూ స్పష్టం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.



Next Story

Most Viewed