సాఫ్ట్‌వేర్ ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్

by  |
సాఫ్ట్‌వేర్ ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ బెట్టింగ్‌ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణం తీసిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చైతన్యనగర్‌కు చెందిన 28ఏళ్ల రవికుమార్ బెంగళూరు ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆరునెలల నుంచి వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నాడు. ఇదేక్రమంలో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ పెట్టి అప్పుల పాలయ్యాడు. తండ్రి ప్రభాకర్ రూ.లక్ష అప్పు తీర్చినా.. అప్పులు అలాగే ఉండటంతో మనస్థాపానికి గురయ్యాడు. తండ్రి డ్యూటీకి వెళ్లగానే బెడ్‌ రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. కొంతసేపటి తర్వాత గమనించిన తల్లి.. స్థానికులతో కలిసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed