సామాజిక దూరానికి సీఎం దూరం

by  |
సామాజిక దూరానికి సీఎం దూరం
X

చెన్నై: లాక్ డౌన్ కాలంలో ఇంటికే పరిమితమవ్వాలని, అత్యవసర సేవల కోసం బయటికెళ్తే సామాజిక దూరాన్ని తప్పకుండా పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. కానీ, తమిళనాడు సీఎం పళని స్వామి శుక్రవారం నిర్వహించిన న్యూస్ కాన్ఫరెన్స్ లో సామాజిక దూరం మచ్చుకైనా కనిపించలేదు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ రూరల్ హెల్త్ సర్వీసెస్ కాంప్లెక్స్ లోని కరోనా వైరస్ కంట్రోల్ రూమ్ బయట నిర్వహించిన కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ అధికారులు, విలేకరులు గుంపులుగా గుమిగూడి కనిపించారు. సీఎం పళని స్వామి చుట్టూ ఆరోగ్య అధికారులు, పోలీసులు మూగి కనిపించారు.

Tags : Coronavirus, tamil nadu, social distance, news conference, crowd

Next Story

Most Viewed