- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
తిరువనంతపురం: కేరళకు చెందిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాకు బీఎస్ఎన్ఎల్ షాక్ ఇచ్చింది. ఆమె ఉంటున్న క్వార్టర్స్ను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రెహానా బీఎస్ఎన్ఎల్లో మాజీ ఉద్యోగి. మే 11, 2020తో ఆమె ఉద్యోగ కాలం ముగిసింది. దీంతో కొచ్చిలో ఆమె ఉంటున్న రెసిడెన్షియల్ క్వార్టర్స్ను 30 రోజుల్లో ఖాళీ చేయాలని జూన్ 27న బీఎస్ఎన్ఎల్ నోటీసులు జారీ చేసింది. కాగా, ఇటీవల సొంత కుమార్తె, కుమారుడితో కలిసి తన అర్ధనగ్న శరీరంపై పెయింట్ వేయించుకుని, ఆ వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేసి వివాదాల్లో చిక్కుకుంది. దీంతో ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. 2018లో శబరిమల అయ్యప్ప దర్శనానికి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆమె ఆలయంలోకి వెళ్లేందుకు అప్పట్లో విశ్వప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.
Next Story