'మేజర్‌'లో శోభితా ధూళిపాల కీలకపాత్ర

by  |
మేజర్‌లో శోభితా ధూళిపాల  కీలకపాత్ర
X

దిశ, వెబ్‌డెస్క్: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ 26/11 ముంబై అటాక్‌లో వీరమరణం పొందిన జవాన్. తన మరణానంతరం దేశ అత్యున్నత అశోక చక్ర పురస్కారాన్ని పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మేజర్’. అడవి శేషు హీరో కాగా.. తెలుగు, హిందీలో బైలింగ్వల్‌గా వస్తున్న మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏప్లస్ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘గూఢచారి’ డైరెక్టర్ శశి కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హీరో అడవి శేషుకి డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా … ఈ చిత్రంతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

అయితే ‘గూఢచారి’ హీరోయిన్‌ శోభితా ధూళిపాల ‘మేజర్’ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో శోభితా తనదైన స్టోరీ ట్రాక్‌తో ఆకట్టుకోనుందట. ఎమోషనల్ డెప్త్ ఉన్న పాత్రలో డైనమిక్‌గా కనిపించనుందని తెలుస్తోంది. తనతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని అడవి శేషు తెలిపాడు. కాగా ‘మేజర్’ భారతదేశం కోసం చేస్తున్న సినిమా అని .. చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు ఎదురుచూస్తున్నాని చెప్పాడు. అయితే ‘మేజర్’ సినిమా ప్రకటించి ఏడాది గడిచిపోతుందని.. మూవీకి సంబంధించిన టీజర్, ట్రయలర్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్.



Next Story

Most Viewed