పేదలకు ‘స్నేహ హస్తం’ చేయూత

by  |
పేదలకు ‘స్నేహ హస్తం’ చేయూత
X

దిశ, రంగారెడ్డి: లాక్ డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లా ప్రజలకు స్నేహ హస్తం ఫౌండేషన్ సభ్యులు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. తమ పదో తరగతి మిత్రులందరం కలిసి ఏర్పాటు చేసిన స్నేహా హస్తం ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమలు చేపడుతున్నామని తెలిపారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు తమ ఫౌండేషన్ ద్వారా తోచిన సాయం చేస్తూ.. చేయూతనిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెరికేటి యాదయ్య, సభ్యులు ఆనంద్, రమేష్ పాల్గొన్నారు.

Tags: sneha hastam foundation, essential goods, rangareddy, lockdown, rice distribution

Next Story

Most Viewed