- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: హాస్పిటల్ లో మెటర్నటీ వార్డు.. అందరు నిశబ్ధంగా పడుకున్నారు.. కొంతమంది తమ పిల్లలను ఆడిస్తున్నారు. ఇంతలో ఒక అనుకోని అతిధి ఆ గదిలోకి ప్రవేశించింది. ఎక్కడి నుండి వచ్చిందో .. ఎందరి కళ్ళు గప్పి వచ్చిందో.. ఒక పేషేంట్ బెడ్ కింద నక్కి తచ్చాడుతుంది. ఇక దాన్ని చూసిన అక్కడ రోగులు ఒక్కసారిగా కేకలు వేశారు. ఇంతకీ ఆ అనుకోని అతిధి .. ఒక నాగుపాము. ఆదిలాబాద్ రిమ్స్ లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఆదిలాబాద్ రిమ్స్ లో ఒక నాగుపాము కలలం రేపింది. మెటర్నటీ వార్డు లో దూరిన పాము రోగుల అరుపులకు పక్కనే ఉన్న మూత్రశాలలోకి వెళ్ళింది. అక్కడ ఎక్కువ చెత్తా చెదారం ఉండడంతో పాము తప్పించుకుంది. దీంతో ఆ వార్డులోని రోగులందరిని వేరే వార్డుకు షిఫ్ట్ చేసారు. ఇది కేవలం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షమేనని, తగిన చర్యలు తీసుకోకపోవడం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోగులు వాపోతున్నారు.