రిమ్స్‌లో జాయిన్ అయిన అనుకోని అతిథి.. రోగులు పరార్

by  |
రిమ్స్‌లో జాయిన్ అయిన అనుకోని అతిథి.. రోగులు పరార్
X

దిశ, వెబ్ డెస్క్: హాస్పిటల్ లో మెటర్నటీ వార్డు.. అందరు నిశబ్ధంగా పడుకున్నారు.. కొంతమంది తమ పిల్లలను ఆడిస్తున్నారు. ఇంతలో ఒక అనుకోని అతిధి ఆ గదిలోకి ప్రవేశించింది. ఎక్కడి నుండి వచ్చిందో .. ఎందరి కళ్ళు గప్పి వచ్చిందో.. ఒక పేషేంట్ బెడ్ కింద నక్కి తచ్చాడుతుంది. ఇక దాన్ని చూసిన అక్కడ రోగులు ఒక్కసారిగా కేకలు వేశారు. ఇంతకీ ఆ అనుకోని అతిధి .. ఒక నాగుపాము. ఆదిలాబాద్ రిమ్స్ లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

ఆదిలాబాద్ రిమ్స్ లో ఒక నాగుపాము కలలం రేపింది. మెటర్నటీ వార్డు లో దూరిన పాము రోగుల అరుపులకు పక్కనే ఉన్న మూత్రశాలలోకి వెళ్ళింది. అక్కడ ఎక్కువ చెత్తా చెదారం ఉండడంతో పాము తప్పించుకుంది. దీంతో ఆ వార్డులోని రోగులందరిని వేరే వార్డుకు షిఫ్ట్ చేసారు. ఇది కేవలం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షమేనని, తగిన చర్యలు తీసుకోకపోవడం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోగులు వాపోతున్నారు.

Next Story

Most Viewed