ఇక స్మార్ట్ లేదా ప్రీపెయిడ్ మీటర్లు

by  |
ఇక స్మార్ట్ లేదా ప్రీపెయిడ్ మీటర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా స్మార్ట్ లేదా ప్రీపెయిడ్ మీటర్లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం వినియోగదారులు ఉపయోగిస్తున్న మీటర్లకు బదులు ప్రీపెయిడ్, లేదా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ప్రీపెయిడ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తే ముందస్తుగానే చెల్లింపులు చేయడం వల్ల విద్యుత్ బిల్లులు చెల్లించని వారికి చెక్ పెట్టాలని కేంద్ర సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ భావిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే వినియోగదారుల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తెలిపింది. జూన్ 2023 నాటికి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు చేస్తోంది.

Next Story

Most Viewed