బ్యాంకు వేళల్లో మార్పు.. ఈ సమయంలోనే వెళ్లాలి

by  |
బ్యాంకు వేళల్లో మార్పు.. ఈ సమయంలోనే వెళ్లాలి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. కరోనాతో స్టేట్ బ్యాంకు ఉద్యోగులు దాదాపు 600 మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్ బీసీ) బ్యాంకుల పని వేళలను తగ్గించాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సేవల్ని పరిమితం చేయాలని ఎస్ఎల్‌బీసీ యోచిస్తోంది. అలాగే, సిబ్బందిని 50 శాతానికి పరిమితం చేయాలని కూడా నిర్ణయించింది. కానీ బ్యాంకు పనివేళలను తగ్గించినా ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మిషన్ల సహా ఇతర ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని ఎస్ఎల్‌బీసీ బ్యాంకర్లను ఆదేశించింది. వచ్చే నెల 15వ తేదీ వరకు బ్యాంకు వేళలను కుదించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదానికి పంపినట్టు తెలుస్తోంది. అనుమతి వస్తే రేపటి నుంచే కొత్త పనివేళలు అమల్లోకి వస్తాయి. అయితే బ్యాంకుల ప్రధాన కార్యాలయాల వేళల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపింది.

Next Story

Most Viewed