తెలంగాణ డీజీపీకి స్కోచ్ అవార్డు

by  |
తెలంగాణ డీజీపీకి స్కోచ్ అవార్డు
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: కరోనా నేపథ్యంలో ప్రజాసేవకు రాష్ట్ర పోలీసులు స్పందించిన తీరుకు డీజీపీ మహేందర్‌రెడ్డి స్కోచ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం వర్చువల్ సమావేశంలో ఈ అవార్డును ప్రకటించారు. లాక్‌డౌన్‌లో ప్రజల పట్ల సానుకూలంగా వ్యవహారించడం, వలస కార్మికుల తరలింపులో అనేక సేవలు అందించడం తదితర అంశాలను పరిశీలించిన స్కోచ్ సంస్థ బంగారు పతకానికి ఎంపిక చేసింది. ఈ అవార్డును రాష్ట్ర పోలీసుల తరుపున వర్చువల్ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును తెరపై ప్రకటించారు.


Next Story