ప్లేఆఫ్స్‌లో ఓటమి.. అందులో చేరిన కోహ్లీ

by  |
ప్లేఆఫ్స్‌లో ఓటమి.. అందులో చేరిన కోహ్లీ
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. దీంతో ఇప్పటికే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జంబో టీమ్‌ను ఎంపిక చేసింది. ఈ నెల 11 తర్వాత ప్రత్యేక విమానంలో ఆటగాళ్లు, సిబ్బంది యూఏఈ నుంచి సిడ్నీ వెళ్లనున్నారు. కాగా ఐపీఎల్‌లో పాల్గొనని కోచ్ రవిశాస్త్రి, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా ఇప్పటికే ఇండియా నుంచి యూఏఈ వెళ్లి అక్కడ బీసీసీఐ ఏర్పాటు చేసిన బయోబబుల్‌లో ఉన్నారు. వీరితో పాటు ఐపీఎల్‌నుంచి నిష్క్రమించిన జట్ల నుంచి పర్యటనకు ఎంపికైన క్రికెటర్లు కూడా జత కలిశారు. శుక్రవారం బెంగళూరు కూడా ఐపీఎల్ నుంచి నిష్క్రమించడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోబబుల్‌లో చేరాడు. కాగా, పదే పదే బయో సెక్యూర్ జోన్లో ఉండటం క్రీడాకారులకు ఇబ్బందిగా ఉన్నదని.. మానసికంగా కుంగిపోతున్నామని కోహ్లీ అంటున్నాడు. బయోబబుల్ నుంచి బయటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరాడు.

Next Story

Most Viewed