శంషాబాద్ రోడ్డు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య..

by  |
శంషాబాద్ రోడ్డు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య..
X

దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. కారు ఢీకొట్టిన లారీ అదుపు తప్పి బోల్తా కొట్టగా దాని కింద ఆరుగురు చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారు. ప్రమాద సమయంలో లారీలో 30 మంది పైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. వీరంతా ఒరిస్సాకు చెందిన వారు కాగా, ఇటుక బట్టీలో కార్మికులుగా పనిచేస్తున్నాట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే లారీ కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇదిలాఉండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.



Next Story

Most Viewed