‘మహా’ విషాదం.. ఆరుగురి ప్రాణాలు తీసిన ఆక్సిజన్ కొరత

by  |
Covid patients died
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతుండటంతో సామాన్య జనాలు తీవ్రభయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే.. కరోనాతో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోతుంటే.. మరోవైపు కోవిడ్ ఆస్పత్రుల్లో ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో మళ్లీ చోటుచేసుకుంది. తాజాగా.. మహారాష్ట్రంలోని థానే జిల్లా వేదాంత్ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఆక్సిజన్ కొరత కారణంగా ఆరుగురు కరోనా బాధితులు మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.



Next Story

Most Viewed