రక్తపు మడుగులో కుటుంబ సభ్యులు.. చిన్నారి సహా దారుణ హత్య..!

by  |
రక్తపు మడుగులో కుటుంబ సభ్యులు.. చిన్నారి సహా దారుణ హత్య..!
X

దిశ, వెబ్ డెస్క్ : పాత కక్షలు నేపథ్యంలో ఓ కుటుంబం మొత్తాన్ని ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా హత మర్చాడు. కనికరమే లేకుండా చిన్న పిల్లల్ని సైతం కత్తితో పొడిచి పాశవిక ఆనందం పొందాడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురిని నిద్రలోనే చంపేశాడు. వారంతా రక్తపు మడగులో కొట్టుమిట్టాడుతూ తమ ప్రాణాలు విడిచారు.

ఈ దారుణం విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో చోటుచేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో అప్పలరాజు.. ఇంట్లో నిద్రిస్తున్న రమణ కుటుంబంపై పదునైన ఆయుధంతో దాడి చేసి.. ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులందరినీ దారుణంగా హత్యచేశాడు. అనంతరం మృతదేహాలన్నీ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులు రమణ (63), ఉషారాణి (35), రమాదేవి (53), అరుణ(37) చిన్నారులు ఉదయ్ (2), ఉర్విష ( 6 నెలలు) గా గుర్తించారు.

రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షలే ఈ సంఘటనకు కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. ఆరుగురిని.. అప్పలరాజు అనే వ్యక్తే చంపిఉంటాడని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అనంతరం అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను సేకరిస్తున్నారు. ఆరుగురి హత్యతో జుత్తాడలో విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి.



Next Story

Most Viewed