ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురు మృతి

by  |
ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. థార్ జిల్లా చిఖాలియా వద్ద ట్రక్కు-వ్యాన్ ఢీకొని అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను, మృతదేహాలను ఆస్పత్రులకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.



Next Story

Most Viewed