ఏపీలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ

by  |
apgovt
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎంఆర్ డీఏ కమిషనర్‌గా కె.విజయ, సీసీఎల్ఏ అప్పీల్స్ కమిషనర్‌గా డా.పీ.లక్ష్మీనరసింహం, ఏఎంఆర్ డీఏ అడిషనల్ కమిషనర్‌గా పి.ప్రశాంతి, గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జేసీగా జి.రాజకుమారి, కడప ఆర్డీవోగా పి.ధర్మచంద్రారెడ్డి, ఎనర్జీ డిపార్ట్ మెంట్ డిప్యూటీ సెక్రటరీగా పృథ్వీ తేజ్‌లను నియమిస్తూ శనివారం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎనర్జీ డిపార్టమెంట్ డిప్యూటీ సెక్రటరీ పృథ్వీతేజ్‌కు ఏపీ పవర్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.


Next Story

Most Viewed