జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన

by  |
జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూలో టిటిడి నిర్మించ తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని బుధవారం జమ్ము కు సంబంధించిన అధికారులతో కలిసి టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. అక్కడ ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చింది.

దివ్యక్షేత్రం నిర్మాణానికి పాలక మండలి కూడా ఆమోదం తెలిపింది. త్వరలోనే టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని పంపి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశిస్తామని జమ్మూ అధికారులకు సుబ్బారెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed