గాంధీ ఆసుపత్రిలో దారుణం.. అక్కాచెల్లెళ్లను గదిలో బంధించి అత్యాచారం..

by  |
Rape attempt
X

దిశ, వెబ్‌డెస్క్ : సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బావ చికిత్స కోసం వచ్చిన అక్కాచెల్లెళ్లపై గాంధీ ఆసుపత్రికి చెందిన ఉమా మహేశ్వర్ అనే ఉద్యోగి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఆరోపించింది. వారికి మత్తు మందు ఇచ్చి నాలుగు రోజులుగా అత్యాచారం చేసినట్టు తెలిపింది.

నాలుగు రోజులుగా బాధితురాలిని గదిలో బంధించారని తెలిపింది. ఈ క్రమంలో అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే తన అక్క ఆచూకీ ఇంకా తెలియడం లేదని చెల్లెలు ఆవేదన వ్యక్తం చేసింది.

Next Story

Most Viewed