ఉరేసుకుని సింగరేణి ఉద్యోగి ఆత్మ‌హ‌త్య

by  |
ఉరేసుకుని సింగరేణి ఉద్యోగి ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, ఖ‌మ్మం :
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఓ సింగ‌రేణి కార్మికుడు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్నాడు.ఈ ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కేంద్రంలో శ‌నివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ప‌ట్ట‌ణంలోని చ‌మ‌న్‌బ‌స్తీలో నివాసముంటున్న దామర్ల కరుణాకర్ (33) కొత్తగూడెం సింగరేణి ఏరియాలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా మాన‌సిక అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న అతను రెండ్రోజులుగా ఇంటి వ‌ద్ద‌నే ఉంటున్నాడు. ఈక్రమంలోనే పాడుబడ్డ క్వార్టర్స్‌లోనికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

singareni employee, committed suicide, health issues, bhadradri kothagudem

Next Story

Most Viewed