నేటికీ లభించని కార్మికుడి ఆచూకీ

by  |

దిశ, కరీంనగర్

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 11 ఇంక్లైయిన్ బొగ్గు గనిలో అదృశ్యమైన సంజీవ్ అనే కార్మికుని ఆచూకీ నేటికీ లభించలేదు. సింగరేణి అధికారులు గురువారం కూడా గనిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. గనిలోని సంపులో పడిపోయి ఉండొచ్చనే అనుమానంతో మోటార్ల సాయంతో నీటిని తొలగిస్తున్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కార్మికుడి అదృశ్యం విషయమై ఎప్పటికప్పుడు సింగరేణి అధికారులతో సమీక్షిస్తున్నారు.
Tags: Peddapalli, singareni, Worker, missing


Next Story

Most Viewed