సింగపూర్ స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరం.. చిన్నారులపై ప్రభావం

by  |
సింగపూర్ స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరం.. చిన్నారులపై ప్రభావం
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కట్టడి కోసం ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. సింగపూర్‌కు విమాన సర్వీసులు తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సింగపూర్ స్ట్రెయిన్ రకం వేరియంట్ చిన్నారులకు అత్యంత ప్రమాదకరమని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

సింగపూర్ స్ట్రెయిన్ భారత్‌లోకి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ స్ట్రెయిన్ కారణంగా దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా చిన్న పిల్లలకు సైతం టీకా డ్రైవ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోడీకి కేజ్రీవాల్ కోరారు.

Next Story

Most Viewed