- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, జగిత్యాల : విదేశంలో ఉద్యోగం చేస్తున్న జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన ముకుంద్ వినోద్(30)అనే యువకుడు కెనాల్ గేట్ల వద్ద కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం 7గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన వినోద్ ఎంతసేపటికీ ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా వరద కాలువ వద్ద కుటుంబ సభ్యులు, మిత్రులు వెతుకగా అతని బైక్, చెప్పులు వరద కాలువ సమీపంలో కనిపించాయి.
కాలువలో పాతాళ గరిగెతో గాలించగా యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు సింగపూర్లో సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. నెలరోజుల కిందట స్వగ్రామమైన మల్యాలకు వచ్చాడు. కరోనా కారణంగా విమానాలు నడవకపోవడంతో ఇక్కడే ఉన్నాడు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మల్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.