సర్వత్రా ఉత్కంఠ.. తొలి‌సెట్ కోల్పోయిన సింధు

by  |
సర్వత్రా ఉత్కంఠ.. తొలి‌సెట్ కోల్పోయిన సింధు
X

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ సెమీస్‌లో తెలుగుతేజం పీవీ సింధు, చైనా తైపీకి చెందిన తై జు యింగ్ మధ్య తొలిసెట్ పోరు రసవత్తరంగా సాగింది. ఒకనొక దశలో సింధు తైజుయింగ్ పై ఆధిక్యం కనబరచగా తిరిగి వెనకబడింది. తొలిసెట్‌లో ఇద్దరు ప్రపంచ స్థాయి ప్లేయర్లు హోరాహోరీగా తలబడ్డారు. చివరగా 21-18 తేడాతో తై జు యింగ్ ఆధిక్యంలోకి వెళ్లి తొలిసెట్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం సెమీస్ మ్యాచ్‌ క్షణం క్షణం ఉత్కంఠగా సాగుతోంది. ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడమే లక్ష్యంగా సింధు బరిలోకి దిగిన సింధు తర్వాతి సెట్లలో రాణించాలని భారతీయులు కోరుతున్నారు.



Next Story

Most Viewed