‘జోడీ’ రిపీట్.. ప్రశాంత్ సరసన ఆ హీరోయిన్

by  |
‘జోడీ’ రిపీట్.. ప్రశాంత్ సరసన ఆ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ్ హీరో ప్రశాంత్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ పెయిర్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘జోడీ’ సినిమా ద్వారా సూపర్ హిట్ జోడీ అనిపించుకున్న ఇద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘అంధాదున్’ సినిమాను ప్రశాంత్ కోలీవుడ్‌లో రీమేక్ చేస్తుండగా.. హిందీలో టబు చేసిన బోల్డ్ అండ్ చాలెంజింగ్ రోల్‌లో కనిపించబోతుంది సిమ్రాన్.

జెజె ఫెడ్రిక్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో క్యారెక్టర్ గురించి అఫిషియల్‌గా ప్రకటించిన టాలెంటెడ్ యాక్ట్రెస్..తనను తాను న్యూ అవతార్‌లో చూసుకునే చాన్స్ రావడం హ్యాపీగా ఉందని తెలిపింది సిమ్రాన్. ఈ ప్రాజెక్ట్ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానని..ఇది తన కెరీర్‌లో తప్పకుండా బెస్ట్ పార్ట్ అవుతుందని అభిప్రాయపడింది. హీరో ప్రశాంత్ తండ్రి నిర్మిస్తున్న రీమేక్ మూవీ కోసం ప్రశాంత్ ఆల్రెడీ హోమ్ వర్క్ స్టార్ట్ చేశాడట. వెయిట్ తగ్గేందుకు వర్కౌట్ చేస్తున్న హీరో.. పియానో స్కిల్స్ పెంచుకునేందుకు ట్రై చేస్తున్నాడని సమాచారం.

Next Story

Most Viewed