ఈశ్వరన్ టీమ్‌కు శింబు ‘బంగారు‘ కానుక

by  |
ఈశ్వరన్ టీమ్‌కు శింబు ‘బంగారు‘ కానుక
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా గ్రాండ్ సక్సెస్ సాధిస్తే.. హీరోలు తమ దర్శకులకు కార్లు, ఖరీదైన వస్తువులను కానుకగా అందిస్తుంటారు. కానీ తమిళ హీరో శింబు మాత్రం దివాళీ కానుకలతో చిత్ర యూనిట్‌‌ను సర్‌ప్రైజ్ చేశాడు. శింబు ప్రస్తుతం నేషనల్ అవార్డ్ విన్నర్ సుశీంద్రన్ దర్శకత్వంలో ‘ఈశ్వరన్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం శింబు 30 కిలోల వెయిట్ తగ్గి ఫిట్‌గా తయారయ్యాడు. అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, చిత్రం కోసం పని చేసిన దాదాపు 400 మందికి వన్‌ గ్రామ్‌ గోల్డ్‌, కొత్త బట్టలను బహుమతిగా ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నాడు.

https://twitter.com/SilambarasanTR_/status/1324677156912295938?s=20

‘ఈశ్వరన్‌ షూటింగ్‌ పూర్తయింది. ఈ దీపావళికి టీజర్‌ విడుదల కానుంది. ఈశ్వరన్‌ మూవీ టీమ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ప్రత్యేక కృతజ‍్క్షతలు’ అంటూ ట్వీట్‌ చేసిన శింబు.. షూటింగ్ చివరి రోజున దీపావళి కానుకగా మూవీ టీమ్‌కు వన్‌ గ్రామ్‌ గోల్డ్‌, దుస్తులు అందజేశాడు. అంతేకాదు దాదాపు 200 మంది జూనియర్‌ ఆర్టిస్టులకు కూడా కొత్త బట్టలు పంపిణీ చేశాడు. దీంతో యూనిట్‌ సభ్యులు శింబుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఇటీవలే విడుదలైన శింబు ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం తెలుగులో ఈశ్వరుడు పేరుతో రానుండగా, కన్నడ, మలయాళ, హిందీలోనూ రీలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుండగా.. తమన్‌ సంగీతం అందించాడు.

Next Story

Most Viewed