శింబు భరతనాట్యం పిక్స్ వైరల్..

by  |
శింబు భరతనాట్యం పిక్స్ వైరల్..
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్తగా భరతనాట్యం నేర్చుకుంటున్న తమిళ సూపర్ స్టార్ శింబు.. తన కోస్టార్, హీరోయిన్ శరణ్య మోహన్ దగ్గర శిక్షణ పొందుతున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కేవలం నాట్యంపై ఉన్న ఆసక్తితోనే శింబు నృత్యం నేర్చుకుంటున్నాడని తెలిపింది స్టాఫ్. తాజాగా సోషల్ మీడియాకు ఎంట్రీ ఇచ్చిన శింబు ‘ఆత్మన్’ పేరుతో తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి ఎంత కష్టపడ్డాడో తెలుపుతూ వీడియో షేర్ చేయగా.. ఇందులో కర్రసాము, డ్యాన్స్, వర్కౌట్, గుర్రపు స్వారీ, టెన్నిస్ హైలెట్ అయిన విషయం తెలిసిందే.

ఇక లేటెస్ట్‌గా ‘ఈశ్వరన్’ పేరుతో పాన్ ఇండియా మూవీ ప్రకటించిన శింబు.. ఈ సినిమా కోసం 30 కేజీలు తగ్గి వాట్ ఏ కమిట్‌మెంట్ అనిపించాడు. సుశీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో క్రికెట్, పాము స్టోరీలో మెయిన్ రోల్ ప్లే చేయబోతున్నాయని సమాచారం.

Next Story

Most Viewed