సిక్కింలో సాయంత్రం 5 నుంచి ఉదయం 9 గంటల వరకు కర్ఫ్యూ

by  |
Night curfew in Telangana
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో సిక్కిం సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేపటి నుంచి ఈనెల 16 తేదీ వరకు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. సైనిక వాహనాలు, అత్యవసర వస్తువులు తరలిస్తున్న వాహనాలు తప్ప మిగిలిన వాహనాలపై ఆంక్షలు విధించింది. కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం హెచ్చరింది.

Next Story

Most Viewed