నిజామాబాద్‌లో తెల్లవారు జామున ఏం జరిగిందంటే..?

by  |
నిజామాబాద్‌లో తెల్లవారు జామున ఏం జరిగిందంటే..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రామడుగు ప్రాజెక్టు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారు జామున నిజామాబాద్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకిర్ అలీ, సిబ్బంది కలిసి జిల్లాలోని దర్పల్లి మండలం రామడుగు గ్రామ శివారులో దాడులు నిర్వహించారు. ఒక ఇసుక టిప్పర్, 3 ఇసుక ట్రాక్టర్లు, 3 టిప్పర్ ల ఇసుక డంప్, 2 ద్విచక్ర వాహనాలు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వాటిని దర్పల్లి ఎస్సైకి అప్పగించారు.



Next Story